బ్రెయిన్‌ స్ట్రోక్‌తో గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ మృతి

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ మృతి
హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ బీజేపీ కార్పొరేటర్‌ కరుణాకర్‌ హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి కార్పొరేటర్‌ కరుణాకర్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండేండ్ల క్రితం కరుణాకర్‌ కూతురు భవాని కరోనాతో మృతిచెందారు. కరోనా బారిన పడిన భవాని దవాఖానలో చికిత్స పొందుతూ 2021, మే 10న మరణించారు.

Leave A Reply

Your email address will not be published.